రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన బోయిన్పల్లి మండలంలోని దేశాయిపల్లి గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. దేశాయిపల్లి గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైకులపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.