ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల కోసం వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. పోటీ చేసే అంశంపై టీడీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సంఖ్యాబలం పరంగా ఈ 3 స్థానాలు కూడా వైసీపీకే దక్కుతాయి. ఇదే జరిగితే 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ప్రస్తుతం టీడీపీ తరఫున రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే ఎంపీగా ఉండగా.. 2024 ఏప్రిల్, 2తో ఆయన పదవీకాలం ముగియనుంది.