ధర్మపురి దేవస్థానంలో భక్తుల తాకిడి

69చూసినవారు
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్