ధర్మపురి దేవస్థానం హుండీల లెక్కింపు

556చూసినవారు
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు శనివారం విప్పి లెక్కించారు. తేదీ 11-01-2024 నుండి 16-03-2024 వరకు మొత్తం 64 రోజులకు రూ. 31, 29, 424 ఆదాయం సమకూరినట్లు ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. అలాగే మిశ్రమ బంగారము 15 గ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోల 100 గ్రాములు, 50 విదేశి నోట్లు వచ్చినట్లు చెప్పారు. ఈ లెక్కింపులో జిల్లా దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ రవికిషన్, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్