గుండెపోటుతో విద్యార్థి మృతి
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో విషాదం నెలకొంది. గుండెపోటుతో విద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఎల్లంకి సాయి తేజ(14) 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు విద్యార్థిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె వ్యాధితో సాయి బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.