లడ్డూ వేలం పాటలో పాల్గొని అంతలోనే గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

53చూసినవారు
లడ్డూ వేలం పాటలో పాల్గొని అంతలోనే గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
వినాయక లడ్డూ వేలం పాటలో పాల్గొన్న యువకుడు మరికొద్ది సేపటికే గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ మణికొండ అల్కాపురి కాలనీలో చోటు చేసుకుంది. శ్యామ్ ప్రసాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాత్రి అల్కాపురిలో కొనసాగిన‌ లడ్డూ వేలంలో పాల్గొన్నాడు. రూ.15 లక్షల వరకు లడ్డూ వేలం‌ పాడాడు. అనంతరం మండపం వద్ద నృత్యాలు చేశాడు. కాగా, ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటుతో మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్