రాష్ట్రస్థాయిలో సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన హుజురాబాద్ విద్యార్థులు

267చూసినవారు
రాష్ట్రస్థాయిలో సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన హుజురాబాద్ విద్యార్థులు
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల/ కళాశాల విద్యార్థుల రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు హుజురాబాద్ పాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మంజుల తెలిపారు. ఈనెల 8వ తారీఖున అన్నారంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో హుజురాబాద్ గురుకుల పాఠశాల నుండి 9వ తరగతి విద్యార్థినిలు ఎం. విద్యార్షి, పి. వైష్ణవి, 8వ తరగతి నుండి బి. బావిక మంచి ప్రతిభ కనబరిచి ఎంపికై ఈనెల 13 నుండి 14 వరకు నిజామాబాద్ జిల్లా ధర్మారంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనబోతున్నట్లు శుక్రవారం తెలిపారు. ఈ పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూపాఠశాల ప్రిన్సిపల్ మంజుల, వైస్ ప్రిన్సిపల్ సత్య ప్రియ, పి ఈ టి సుస్మిత మరియు అధ్యాపక బృందం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్