మోదీపై సీఎం రేవంత్ ఫైర్
రిజర్వేషన్లు రద్దు చేయొద్దని, రాజ్యాంగాన్ని మార్చవద్దని అడిగినందుకు మోదీ, అమిత్ షా నాపై కేసు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కోరుట్లలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 'ఈ తెలంగాణ నా ఊరు, నా ప్రాంతం.. నా రాష్ట్రానికి వచ్చి, నా రాష్ట్రం నడి గడ్డపై నిల్చుని నన్నే బెదిరిస్తావా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.