త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక అధికారి సమీక్ష సమావేశం

593చూసినవారు
త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక అధికారి సమీక్ష సమావేశం
శంకరపట్నం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి కే దేవేందర్ రావు ఆధ్వర్యంలో శనివారం తాగునీటి సరఫరా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జోగినపల్లి అనుపమ పాల్గొని గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని ఈ వేసవికాలంలో ప్రజలకు నీటి ఎద్దడి కలగకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులను గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

ట్యాగ్స్ :