కరీంనగర్ అభివృద్ధికి ఏం చేసావ్ బండి: జివిఆర్

1057చూసినవారు
మానకొండూరు నియోజకవర్గం కేంద్రంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు ఆధ్వర్యంలో ఆదివారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బండి సంజయ్ ప్రజాహిత యాత్ర అనేది ప్రజలకు హితమైన యాత్ర కాదని, ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని, ఎప్పుడు దేవుడి పేరు చెబుతూ రాజకీయం చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంటాడని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్