వలస కార్మికుల పిల్లలను పాఠశాలలో చేర్పించాలి: కలెక్టర్

52చూసినవారు
వలస కార్మికుల పిల్లలను పాఠశాలలో చేర్పించాలి: కలెక్టర్
జిల్లాలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఇటుక బట్టీలు, హోటల్స్, వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సిఐ కృష్ణ, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, డిసిపిఓ కమలాకర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్