కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమానికి జిల్లా నుండి ఇద్దరు ఎంపికయ్యారు. ఏప్రిల్ 10న జరిగిన జిల్లా స్థాయి ప్రేరణ పోటీలలో బాలుర విభాగంలో అప్పన్నపేట విద్యార్థి మహమ్మద్ అలీ రిషన్, బాలికల విభాగంలో ఓదెల ఆదర్శ పాఠశాల నుంచి పరిశే ఆభిజ్ఞ ఎంపికయ్యారు. మే 13 నుంచి 17 వరకు గుజరాత్ లోని వాదనగర్ లో జరిగే జాతీయ స్థాయి ప్రేరణ కార్యక్రమానికి ఎస్కార్ట్ టీచర్ తో కలిసి పాల్గొంటారు.