గుడుంబా అమ్మిన ఏడుగురి బైండోవర్

79చూసినవారు
గుడుంబా అమ్మిన ఏడుగురి బైండోవర్
ముత్తారం మండలం ఖమ్మంపల్లి, జిల్లేల్లపల్లి, అడవి శ్రీరాంపూర్, ఇప్పలపల్లి, లక్కారం గ్రామాలకు చెందిన ఏడుగురు వ్యక్తులను తహసీల్దార్ సుమన్ ఎదుట బైండోవర్ చేసినట్టు ఎక్సైజ్ ఎస్సై సాయికుమార్ మంగళవారం తెలిపారు. గతంలో వీరు గుడుంబా అమ్మి దొరకడంతో మళ్లీ గుడుంబా అమ్మకుండా తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామని తెలిపారు. ఇప్పటి నుండి ఏడాదిపాటు గుడుంబా అమ్మి దొరికితే ఏడాది జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్