May 09, 2024, 17:05 IST/మానకొండూర్
మానకొండూర్
అనుమతి లేని మట్టి లారీలను పట్టుకున్న పోలీసులు
May 09, 2024, 17:05 IST
శంకరపట్నం మండల కేంద్రంలో అనుమతి పత్రాలు లేకుండా మట్టిని తరలిస్తున్న మూడు మట్టి లారీలను కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రం నుండి కరీంనగర్ కు బంక మన్ను తరలిస్తున్న మూడు లారీలను పట్టుకొని గనులు భూగర్భజల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.