ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు వినాయక చవితి వేడుకలు

85చూసినవారు
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మట్టి సేకరించి ప్రతిమను తయారు చేసి పూజలు నిర్వహించారు. అదేవిదంగా విద్యార్థులు 21 రకాల నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవి బాబు, ఉపాధ్యాయులు లక్ష్మణ్, లక్ష్మి, తేజ, శారద, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్