విద్యార్థి మరణించడం దురదృష్టకరం : కోరుట్ల ఎమ్మెల్యే

80చూసినవారు
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రెండు వారాల్లో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం బాధాకరమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ, పెద్దాపూర్ లోనే కాదు ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఇప్పటికే వివిధ
గురుకులాల్లో జరగడం ఈ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని, ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు ఇప్పటికైనా మొద్దు నిద్ర లేచి విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్