పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. ఆలయ ఈవో సదయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి దేవాదాయ శాఖ పరిశీలకులు పర్యవేక్షణలో భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించగా, రూ. 20, 09, 533ల ఆదాయం వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.