శివాలయం ప్రధాన అర్చకులు అనారోగ్యంతో మృతి
రాయికల్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర శివాలయం పూజారి చెవులమద్ది శివలింగం అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. శివలింగం మృతితో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, భక్తులు వచ్చి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.