గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు శనివారం జీసస్ ఫర్ రన్ యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ పాల్గోని మాట్లాడుతూ, జీసస్ ప్రవచనాలు చాలా పవిత్రమైనవని సేవా నిరతిని త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భగవత్ స్వరూపులు జీసస్ అని అన్నారు. యేసు సోదరులతో పాటు పాస్టర్స్, కార్పొరేటర్లు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.