అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

9219చూసినవారు
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన నేతేట్ల మల్లయ్య (48) అనే వ్యక్తి కుటుంబ పోషణకై అప్పులు చేశాడు. అప్పుల భారం పెరగడంతో గురువారం రాత్రి 10: 30 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి నారాయణపూర్ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్