పంజాబ్లోని జలంధర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. నిర్మానుష్య రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఓ వృద్ధురాలిని ఇద్దరు దొంగలు గమనించారు. స్కూటీపై ఆ ఇద్దరు దొంగలు ఆమెకు సమీపంలో వెళ్లారు. వెంటనే ఆమె వద్దనున్న పర్సును లాక్కున్నారు. ఈ క్రమంలో వృద్ధురాలిని కొంత దూరం ఈడ్చుకెళ్లారు. అనంతరం స్కూటర్పై పరారయ్యారు. ఈ ఘటనలో ఆ వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.