ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో మహానది నదిపై శుక్రవారం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఛత్తీస్గఢ్లోని ఖర్సియా ప్రాంతానికి చెందిన 50 మందికి పైగా ప్రయాణికులు బార్ఘర్ జిల్లాలోని పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.