అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం జరిగింది. నాడియాడ్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు డ్రైవర్ ఇతర వాహనాలను గమనించకుండా రోడ్డుపై వాహనాన్ని పోనిచ్చాడు. అదే సమయంలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. రెప్పపాటులో కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చనిపోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.