కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో చివరి మావోయిస్టుగా భావిస్తోన్న లక్ష్మీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరైండరైన ఆమె.. ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దాదాపు ఇరువై ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిన లక్ష్మీ నక్సలైట్ అజెండాతో పనిచేయడం ప్రారంభించింది.