చైనీయులకు వీసాల జారీ కేసులో కార్తీ చిదంబరానికి బెయిల్

79చూసినవారు
చైనీయులకు వీసాల జారీ కేసులో కార్తీ చిదంబరానికి బెయిల్
చైనీయులకు వీసాల కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరానికి ఊరట లభించింది. ఢిల్లీలోని రౌసు అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి వాయిదాకు కచ్చితంగా హాజరుకావాలని కోర్టు పేర్కొంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తునకు కచ్చితంగా హాజరుకావాలని సూచించింది. ఒక వేళ విదేశాల్లో ఉంటే దర్యాప్తు సంస్థ పిలిచిన 48 గంటల్లోపు హాజరుకావాలని గడువు విధించింది.