మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

151557చూసినవారు
మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ను ఖరారు చేశారు. ఆదివారం హైదరాబద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ముఖ్య నాయకులు, కార్యకర్తల అభ్యర్థన మేరకు హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు. దీంతో బీఆర్ఎస్ 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసింది.

సంబంధిత పోస్ట్