బీఆర్కే భవన్లో ఇంధన శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్, మాజీ ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావును పవర్ కమిషన్ విచారణ చేసింది. సుమారు గంటన్నరపాటు వివిధ అంశాలపై వివరాలు కోరినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ ప్రభుత్వం తొలినాళ్లలో చత్తీస్గడ్తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వంపై దాదాపు 1300 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడిందని ప్రభుత్వం చెబుతోంది.