కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

78చూసినవారు
కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పిటిషన్‌పై స్టే కొనసాగిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. ఈ కేసులో ED తరుపు వాదన వినాల్సి ఉందని అభిప్రాయపడింది. దీంతో కేజ్రీవాల్ మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.