ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహారు జైలు అధికారులకు లొంగిపోయారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ఇవాళ సాయంత్రం ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు డిప్యూటీ జడ్జి సంజీవ్ అగర్వార్ ముందు హాజరుపరిచారు. ఈనెల 5వ తేదీ వరకూ కేజ్రీవాల్కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా, రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ వేసిన మరో పిటిషన్ జూన్ 7న విచారణకు రానుంది.