ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ నేడు ప్రత్యేక కోర్టులో హాజరుపరచనుంది. ఈ సందర్భంగా ఆయనను విచారణ జరిపేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నారు. మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. గురువారం రాత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.