ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్పై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ షాక్కు గురైంది. తాజాగా ఆదివారం హైకోర్టు స్టేపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ జరపాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ తాజా పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.