బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్‌ఫెక్ష‌న్‌తో కేర‌ళ‌వాసి మృతి

75చూసినవారు
బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్‌ఫెక్ష‌న్‌తో కేర‌ళ‌వాసి మృతి
కేర‌ళ‌లోని కాస‌ర్‌గ‌డ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మ‌ణికంద‌న్ అనే వ్య‌క్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధితో మృతిచెందాడు. క‌న్నౌరులోని ప్రైవేటు ఆస్ప‌త్రిలో అత‌ను అమీబిక్ మెనింజోఇన్‌సెఫ‌లైటిస్‌కు చికిత్స తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఆరోగ్యం విషమించడంతో అత‌ను క‌న్నుమూశాడు. బాధిత వ్యక్తి జ్వరం రావడంతో ముందుగా కాస‌ర్‌గ‌డ్‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరాడు. ఈ క్రమంలో జరిపిన సెరిబ్రోస్పైన‌ల్ ఫ్లూయిడ్ టెస్టు ఆధారంగా అత‌నికి ఈ సమస్య ఉన్న‌ట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్