ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి

63చూసినవారు
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి
TG: సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం కేసు దర్యాప్తులో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మీడియా ఛానెల్‌ నిర్వాహకుడు అరువెల శ్రవణ్‌రావుకు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వారిని హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీబీఐ అనుమతిచ్చింది.

సంబంధిత పోస్ట్