ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు

80చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందో లేదో విచారణలో తేలుతుందని అన్నారు. దీనిపై తాను ఇప్పుడేమి మాట్లాడనని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయం కోసం వాడుకోవడం మంచిది కాదన్నారు. దేశ భద్రతకు సంబంధించిన టెక్నాలజీని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటే అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. స్వార్థం కోసం ఫోన్ ట్యాపింగ్ ఎవరూ చేసినా తప్పేనని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :