AP: రాష్ట్రంలో కీలకమైన పోలింగ్ జరిగిపోయింది. మరో ముఖ్యమైన ఓటు బ్యాంకు ఉద్యోగులు. వీరి ఓట్లు 5 లక్ష ల 20 వేల వరకు ఉన్నాయి. వీటిలో 99 శాతం అంటే.. 4 లక్షల 97 వేల ఓట్లు పోలైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఉద్యోగుల ఓట్లలోనూ తమకు సగానికిపైగానే దక్కుతాయని వైసీపీ లెక్కలు వేసుకుంది. అయితే ఉద్యోగులకు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే విషయం ప్రశ్నగానే ఉంది. నాలుగో వంతు ఓట్లు పడితే వైసీపీకి అదే ఎక్కువని పరిశీలకులు చెబుతున్నారు.