తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకన్న దర్శనం కోసం భక్తులతో పాటు ప్రముఖులు కూడా ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో హీరో విశ్వక్ సేన్, అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర, తెలంగాణ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి ఉన్నారు.