ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో కోఆర్డినేటర్లను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నాయకులకు కేటాయించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామసహయం రఘురాంరెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మహ్మద్ జావీద్ ను నియమించారు.