ఖమ్మం నగరంలోని ఇల్లెందు క్రాస్ రోడ్ 33/11 సబ్ స్టేషన్ 11 కేవీ కవిరాజ్ నగర్ ఫీడర్ లో ఉన్న ఎల్టీ లైన్ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని టౌన్-3 ఆపరేషన్స్ ఏఈ బీ. తావుర్యా ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కవిరాజ్ నగర్ రోడ్ నంబర్ 9, 10లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈ కోరారు.