అర్థరాత్రి ఆగిపోయిన బస్సు.. ప్రయాణికుల ఇక్కట్లు

70చూసినవారు
అర్థరాత్రి ఆగిపోయిన బస్సు.. ప్రయాణికుల ఇక్కట్లు
AP: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద హైవేపై ఎలిగన్స్ ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. బస్సు వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా అర్థరాత్రి 2 గంటలకు నిలిచిపోయింది. బస్సును అక్కడే వదిలి బస్సు డ్రైవర్, క్లీనర్ వెళ్లిపోయారు. డబ్బులు వెనక్కి ఇస్తామని ట్రావెల్స్‌ నిర్లక్ష్యపు సమధానం చెబుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల ఫిర్యాదుతో డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్