లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా సమకూర్చుకున్న అదనపు ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో ఏఆర్ఓలు, పార్టీల అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షాన ర్యాండమైజేషన్ పూర్తిచేశామని చెప్పారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఉన్నారు.