మధిరలో రెడ్డి గార్డెన్స్ ఎదురుగా చెలరేగిన మంటలు

554చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ ప్రాంగణానికి ఎదురుగా ఉన్నటువంటి ముల్ల కంపలకు మంగళవారం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు ఒకసారిగా భయభ్రాంతులకు లోనై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న ఫైర్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.