రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు

570చూసినవారు
తల్లాడ మండలంలోని కేశ్వాపురం గ్రామంలో శుక్రవారం రేణుక ఎల్లమ్మతల్లి ఆలయం 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లికి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్, ఎస్సై కొండల్ రావు పాల్గోని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్