ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కారేపల్లి రూరల్ సిఐ బి తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం కారేపల్లి గ్రామపంచాయతీతో పాటు మండల పరిధిలోని గేట్ కారేపల్లి, మేకల తండా, దుంబ్బ తండ, భాగ్యానగర్ తండా గ్రామాలలో కారేపల్లి పోలీసులు కేంద్రబలగాలతో కవాతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలవుతున్న వేళ తప్పనిసరిగా నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.