కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

71చూసినవారు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలు
వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరంలో గాంధీజీ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు ప్రశాంత్, జాబోరే గణేష్, జామల్పూరి సుజ్జు, బస్సికి పేంటు, కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్