సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్ పేట మండలం గుండేపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన నిర్మల, కోయపల్లి గ్రామానికి చెందిన రవి కుమార్ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. నిర్మల వేరొకరితో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతో రవి శుక్రవారం హత్య చేసి బావిలో పడేశాడు. నిర్మల తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశారు.