పోడు భూముల స్వాధీనం మానుకోవాలి: సిర్పూర్ ఎమ్మెల్యే

578చూసినవారు
అటవి అధికారులు ‌పోడు భూములను స్వాధీనం చేసుకోవడం మానుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. కాగజ్నగర్లోని కడంబా శివారులో ఉన్న పోడు భూముల్లో 2రోజులుగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రైతులతో కలిసి భూములను పరిశీలించారు. పోలీస్ బలగాలను వెంటపెట్టుకుని ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

సంబంధిత పోస్ట్