ఈనెల 5 న కాగజ్‌నగర్‌ కు రానున్న అమిత్ షా

81చూసినవారు
ఎస్పీయం గ్రౌండ్ లో 5 వ తేదిన బీజేపి వికాస సంకల్ప సభను విజయవంతం చేయండి అని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లో ఆయన మాట్లాడారు. స్తానిక ఎస్పీఎం క్రిడా మైదానంలో జరుగనున్న బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్