ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పోటీ చేయడంపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ‘యువరాజు వయనాడ్లో ఓడిపోనున్నారని, అక్కడి పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం అన్వేషణ ప్రారంభిస్తారని చెప్పాను. అమేథీ అంటే భయంవేసి రాయ్బరేలీ వైపు పరుగులు తీస్తున్నారు. భయపడకండి ఈ ఎన్నికలు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’ అని అన్నారు.