గౌరవ వేతనం ఆగిపోయింది.. కూలీగా మారాను: మొగులయ్య

559చూసినవారు
గౌరవ వేతనం ఆగిపోయింది.. కూలీగా మారాను: మొగులయ్య
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ఇప్పుడు ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తున్నారు. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న 10 వేల రూపాయల నెలవారి గౌరవ వేతనం ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో పూటగడవటం కోసం తాను పని కోసం చాలా చోట్లు ప్రయత్నించానని తనపై సానుభూతి చూపించి మర్యాదపూర్వకంగా తనకు పని ఇవ్వలేదన్నారు.

సంబంధిత పోస్ట్