ప్లాస్టిక్ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు

58చూసినవారు
స్వచ్చతా పక్షోత్సవాలలో భాగంగా సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, సిర్పూర్ పేపర్ మిల్స్, స్పర్శ ఫౌండేషన్ వారు సంయుక్తంగా ప్లాస్టిక్ నిర్మూలనకై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని మేయిన్ మార్జెట్లోని, వర్తక, కిరాణా, చిరు వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ ను నిర్మూలించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అశోక్, శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్